Samantha పిల్లల్ని కనాలనుకుంది.. అందుకే మాకు కండీషన్లు పెట్టింది.. సంచలన విషయాలు వెల్లడించిన `శాకుంతలం` నిర్మాత!
ABN, First Publish Date - 2021-10-09T17:09:18+05:30
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోవడం ఎంతో మందికి షాక్ కలిగించింది.
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోవడం ఎంతో మందికి షాక్ కలిగించింది. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ ఈ ఇద్దరు ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సమంతపై ట్రోలింగ్ జరుగుతోంది. వీరు విడిపోవడానికి కారణాలు ఇవేనంటూ చాలా మంది విశ్లేషణలు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని కనడానికి సమంత సిద్ధంగా లేదని, అందుకే చైతన్య దూరమయ్యాడని చాలా మంది చెబుతున్నారు.
సమంత ప్రధాన పాత్రలో `శాకుంతలం` సినిమాను నిర్మించిన నీలిమా గుణ.. చై-సామ్ విడాకుల వ్యవహారం గురించి మాట్లాడారు. సంచలన విషయాలు వెల్లడించారు. ``శాకుంతలం` సినిమా కోసం మేం సమంతను సంప్రదించే సమయానికి ఆమె సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నామని, ఇప్పట్లో సినిమాలు చేయలేనని చెప్పింది. అయితే, శాకుంతలం కథ నచ్చడంతో కొన్ని షరతులు పెట్టి సినిమా చేయడానికి అంగీకరించింది. ఆగస్ట్ నెలకు షూటింగ్ను పూర్తి చేయాలని చెప్పింది. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోవాలని సమంత నిర్ణయించుకుంది. తల్లి కావాలని కోరుకుంది. తన ప్రాధాన్యత దానికేనని చెప్పింది. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు.. ఆగస్ట్ నెలలో వారి విడాకుల గురించి తెలిసింది. చై-సామ్ విడిపోవడం షాకింగ్గా ఉంద`ని నీలిమా చెప్పింది.