‘నాట్యం’ గర్వకారణం: నిర్మాతల మండలి
ABN , First Publish Date - 2021-11-09T03:00:29+05:30 IST
సంధ్యా రాజు నటించి, నిర్మించిన ‘నాట్యం’ చిత్రం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫి) ప్రదర్శనకు ఎంపికైంది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించి ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతమైంది. ఈనెల 21 నుంచి 28 నవంబర్ గోవాలో జరిగే ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై చిత్ర బృందానికి సన్మానం జరగనుంది.

సంధ్యా రాజు నటించి, నిర్మించిన ‘నాట్యం’ చిత్రం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫి) ప్రదర్శనకు ఎంపికైంది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించి ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతమైంది. ఈనెల 21 నుంచి 28 నవంబర్ గోవాలో జరిగే ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై చిత్ర బృందానికి సన్మానం జరగనుంది. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఈ ఏడాది సెలెక్షన్ జ్యూరీలో తెలుగు సభ్యులు ఎవరూ లేకపోయినా ‘నాట్యం’ ఒకటే ఇండియన్ పనోరమాకు ఎంపిక కావడం గర్వ కారణం’’ అని టి. ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల అన్నారు.