నాగశౌర్య ఆర్చరీ ఫిల్మ్ ‘ల‌క్ష్య‌’.. అప్‌డేట్ ఇదే

ABN , First Publish Date - 2021-03-25T23:49:53+05:30 IST

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌

నాగశౌర్య ఆర్చరీ ఫిల్మ్ ‘ల‌క్ష్య‌’.. అప్‌డేట్ ఇదే

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు, సచిన్ ఖేడేకర్ న‌టిస్తున్నారు. నాగ‌శౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించిన తాజాగా అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. 


ఇప్పటి వరకు ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, అలాగే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీలో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని ఎయిట్‌ప్యాక్ లుక్‌తో స‌ర్పైజ్ చేశారు నాగ‌శౌర్య‌. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి, నాగ‌శౌర్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన టీజ‌ర్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ప్రాచీన కాలంలో ఆర్చరీని వేట మరియు పోరాటాల‌ కోసం ఉపయోగించేవారు. అనేక పౌరాణిక కథలలో దాని ఉనికిని మరచిపోలేము. గొప్ప యోధులుగా, దేవుడిగా వ్యవహరించే వ్యక్తులు ఎల్లప్పుడూ విల్లుని ధ‌రించే కనిపిస్తారు. ఇప్పుడు ఆ క్రీడ‌ వెండితెరపైకి రాబోతుంది. విలువిద్య ఆధారంగా తెరకెక్కిన భారతదేశం యొక్క మొట్టమొదటి చిత్రంగా త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి రావ‌డానికి సిద్ధ‌మవుతుందని మేకర్స్ తెలిపారు.

Updated Date - 2021-03-25T23:49:53+05:30 IST