ఇటువంటి క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైమ్: ముస్కాన్ సేథి
ABN , First Publish Date - 2021-09-13T22:06:52+05:30 IST
‘పైసా వసూల్’, ‘రాగల 24 గంటల్లో’ చిత్రాల్లో నటించిన హీరోయిన్ ముస్కాన్ సేథి.. సినిమాలతో పాటు బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్లో తెరకెక్కిన ‘మరో ప్రస్థానం" సినిమాలో తనీష్ సరసన హీరోయిన్గా
‘పైసా వసూల్’, ‘రాగల 24 గంటల్లో’ చిత్రాల్లో నటించిన హీరోయిన్ ముస్కాన్ సేథి.. సినిమాలతో పాటు బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్లో తెరకెక్కిన ‘మరో ప్రస్థానం" సినిమాలో తనీష్ సరసన హీరోయిన్గా నటించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దర్శకుడు జానీ తెరకెక్కించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ముస్కాన్ సేథి మీడియాతో ముచ్చటించింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘మరో ప్రస్థానం చిత్రం నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఈ చిత్రంలో లెంగ్తీ డైలాగులు చెప్పాను. ఈ చిత్రంలో కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ చేశాం. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్లో కూడా నటించాను. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. అయితే.. డైరెక్టర్ జానీ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు. డైలాగుల విషయంలో, కొన్ని సీన్స్లో ఎలా నటించాలో ఆయన యాక్ట్ చేసి చూపించడం జరిగింది. జానీ సార్ ప్రతిదీ డీటైల్డ్గా చెప్పడం వలనే నేను ఈ క్యారెక్టర్ ఈజీగా చేయగలిగాను. ఈ సందర్భంగా జానీసార్కి మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను.
కథ విషయానికి వస్తే.. రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్గా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే.. ఈ కథ అంతా ఒక రోజులోనే జరుగుతుంది. ప్రతి సీన్ చాలా రియలిస్టిటిక్గా ఉంటుంది. ఫైట్ మాస్టర్ శివ గారి నేతృత్యంలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఆయన మా అందర్నీ చాలా బాగా గైడ్ చేశారు. టోటల్గా.. ఈ సినిమా నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్కి ఈ చిత్రం నచ్చుతుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను..’’ అని తెలిపారు.
