Merlapaka gandhi: స్పీడ్‌ పెంచుతా.. రీమేక్‌లు చేయను

ABN , First Publish Date - 2021-09-13T17:41:00+05:30 IST

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, 'ఎక్స్‌ప్రెస్‌ రాజా’ చితాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు మేర్లపాక గాంధీ. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'మాస్ట్రో’. హిందీ హిట్‌ చిత్రం అంధాధూన్‌’కు రీమేక్‌ ఇది.

Merlapaka gandhi: స్పీడ్‌ పెంచుతా.. రీమేక్‌లు చేయను

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, 'ఎక్స్‌ప్రెస్‌ రాజా’ చితాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు మేర్లపాక గాంధీ. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'మాస్ట్రో’. హిందీ హిట్‌ చిత్రం అంధాధూన్‌’కు రీమేక్‌ ఇది. ఈ నెల 17న ఓటీటీ వేదికగా విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ పంచుకున్న ఆసక్తికర విషయాలు..


అరకు దగ్గర ఊర్లో ఉన్నప్పుడు మా అసిస్టెంట్‌ చెబితే ‘అంధాధూన్‌ చూశా. రీమేక్‌ చేేస్త ఇటువంటి సినిమా చేయాలనుకున్నా. హీరో నితిన్‌, నిర్మాత సుధాకర్‌రెడ్డి గారు సంప్రదించడంతో అంగీకరించా.


– రీమేక్‌ చేసేటప్పుడు టెన్షన్‌ ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు తీస్తే.. కాపీ పేస్ట్‌ అంటారు. మారులు చేేస్త మాతృకను చెడగొట్టాడు అని అంటారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఈ సినిమా చేశా. ఫైనల్‌ అవుట్‌ పుట్‌ చూశా. హ్యాపీ! ఇకపై రీమేక్స్‌ చేయను.


– హిందీలో టబు చేసిన పాత్రకు తమన్నాను తీసుకోవాలనే ఆలోచన నాదే. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చూసి  షాకయ్యా! కమర్షియల్‌ చిత్రాలను చేసిన ఆవిడ అందరూ ఆశ్చర్యపోయేలా నటించారు.


– నేను సినిమాలు స్పీడుగా తీస్తాను. కానీ, కథ రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటా. సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్‌ రావడానికి అదే కారణం. ఇకపై స్పీడ్‌ పెంచుతా.  


Updated Date - 2021-09-13T17:41:00+05:30 IST