'మేజర్': భారీ ధరకు ఆడియో రైట్స్..!
ABN, First Publish Date - 2021-11-18T14:09:53+05:30
టాలెంటెడ్ హీరో అడివి శేష్, సాయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మేజర్'. ఈ మూవీ ఆడియో రైట్స్ను జీ వారూ దక్కించుకున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా
టాలెంటెడ్ హీరో అడివి శేష్, సాయీ మంజ్రేకర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మేజర్'. ఈ మూవీ ఆడియో రైట్స్ను జీ వారూ దక్కించుకున్నారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొంతోంది. అడవి శేష్ కథ - స్క్రీన్ ప్లే అందించగా..'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఎ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న 'మేజర్'కు సంబంధించిన ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని భాషలకు సంబంధించిన వరల్డ్ వైడ్ మ్యూజిక్ రైట్స్ను 'జీ మ్యూజిక్' కంపెనీ వారు దక్కించుకున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇక ఈ సినిమాను 2022 ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.