‘జైభీమ్’ సినిమాని ప్రశంసించిన కోనవెంకట్
ABN , First Publish Date - 2021-11-16T21:55:49+05:30 IST
ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. ఘన విజయం సాధించడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న హార్ట్ టచింగ్ మూవీ ‘జై భీమ్’. సూర్య సొంత నిర్మాణంలో.. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చంద్రు అనే ఓ లాయర్ జీవిత చరిత్ర. ఆయన వాదించి విజయం సాధించిన ఓ అరుదైన కేసు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా ప్రశంసలు దక్కించుకుంది.

ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. ఘన విజయం సాధించడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న హార్ట్ టచింగ్ మూవీ ‘జై భీమ్’. సూర్య సొంత నిర్మాణంలో.. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా చంద్రు అనే ఓ లాయర్ జీవిత చరిత్ర. ఆయన వాదించి విజయం సాధించిన ఓ అరుదైన కేసు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా అందులో భార్యా భర్తలుగా నటించిన లిజో మోల్ జోస్ అనే అమ్మాయి, మణికంఠన్ అనే పాత్రధారులు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాను ఇటీవల వీక్షించిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, రచయిత కోన వెంకట్ ప్రశంసలు కురిపించారు.
‘ఇలాంటి కళాఖండాల్ని ప్రశంసించడంలో ఎప్పుడూ లేట్ చేయకూడదు. ‘జై భీమ్’ అలాంటి ఓ హృద్యమైన సినిమా. ఈ తరహా కథాంశాన్ని ఎంపికచేసుకున్నందుకు నేను సూర్యకి ప్రణమిల్లుతున్నాను. ఇలాంటి కళాఖండాన్ని నిర్మించినందుకు జ్యోతికకి, దర్శకత్వం వహించినందుకు జ్ఞానవేల్ కు అభినందనలు తెలుపుతున్నాను’... అంటూ జైభీమ్ చిత్రంపై ప్రశంసల జల్లులు కురిపించారు కోనవెంకట్.