కాంతారావు సతీమణి కన్నుమూత
ABN , First Publish Date - 2021-02-05T18:15:26+05:30 IST
మల్లాపూర్లోని నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

హైదరాబాద్: దివంగత నటుడు కాంతారావు సతీమణి హైమావతి(87) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నాం 12 గంటలకు మల్లాపూర్లోని నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 2009లో మార్చి 22న కాంతారావు మరణించిన విషయం తెలిసిందే. కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.