జూలై రెండో వారంలో...

ABN , First Publish Date - 2021-06-20T06:02:13+05:30 IST

పవన్‌కల్యాణ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఆయన చిత్రీకరణ ప్రారంభించిన చిత్రాలు రెండున్నాయి. ఒకటి... మలయాళ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’కు రీమేక్‌ రూపొందుతున్నది....

జూలై రెండో వారంలో...

పవన్‌కల్యాణ్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఆయన చిత్రీకరణ ప్రారంభించిన చిత్రాలు రెండున్నాయి. ఒకటి... మలయాళ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’కు రీమేక్‌ రూపొందుతున్నది. దీనికి సాగర్‌ కె. చంద్ర దర్శకుడు. మరొకటి... ‘హరిహర వీరమల్లు’. దీనికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. జూలై రెండో వారంలో సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ చిత్రీకరణ పునఃప్రారంభించనున్నారని తెలిసింది. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చిత్రీకరణకు పవన్‌ సంసిద్ధత వ్యక్తం చేయడంతో షెడ్యూల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయట. కరోనా రెండో దశకు ముందు ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ చేశారు. ఏప్రిల్‌లో పవన్‌ కొవిడ్‌-19 బారిన పడటంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇప్పుడు మళ్లీ మొదలు పెడుతున్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ సైతం త్వరలో ప్రారంభిస్తారని సమాచారం.

Updated Date - 2021-06-20T06:02:13+05:30 IST