సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నీలి చిత్రాలు చేస్తూ.. అడ్డంగా దొరికిన హీరోయిన్‌

ABN, First Publish Date - 2021-02-07T23:25:23+05:30

ఒక హీరోయిన్‌కి స్టార్‌ స్టేటస్‌ రావాలంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి అందమే కాదు.. అదృష్టం, అలాగే నటన మీద కూడా పట్టుండాలి. అందంగా లేకపోయినా నటనతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఒక హీరోయిన్‌కి స్టార్‌ స్టేటస్‌ రావాలంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి అందమే కాదు.. అదృష్టం, అలాగే నటన మీద కూడా పట్టుండాలి. అందంగా లేకపోయినా నటనతో ఆకట్టుకున్నవారూ లేకపోలేదు. అయితే హీరోయిన్‌గా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత.. ఆ హీరోయిన్‌కి అవకాశాలు రాకపోతే.. పరిస్థితి ఏంటి?. పాతరోజుల్లో ఏమో తెలియదు కానీ.. ప్రజంట్‌ నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం.. అవకాశాల కోసం హాట్‌ హాట్‌ ఫొటో షూట్స్‌ చేసి సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలను షేర్ చేస్తూ.. అందరి దృష్టిలో పడేలా ప్రయత్నించడం. అప్పటికీ కూడా అవకాశాలు రాకపోతే..?. ఇక ప్రయత్నించి ఫలితం లేదని చెప్పి.. పెళ్లి చేసుకుని కామ్‌గా సినిమాలకు గుడ్‌ బై చెప్పేయడమే. అయితే ఇప్పుడొక హీరోయిన్‌ మాత్రం మరో మార్గం ఎన్నుకుని అడ్డంగా బుక్కయింది. అవకాశాలు రాకపోతే.. హీరోయిన్లు మరీ ఇంతగా దిగజారిపోతారా?.. అనేలా ఇప్పుడందరి చేత అనిపించుకుంటున్న ఆ హీరోయిన్‌ ఎవరో కాదు.. గెహనా వశిష్ట. 


'ఆపరేషన్‌ దుర్యోధన' సిరీస్‌లలో ఐటమ్‌ సాంగ్స్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన గెహనా వశిష్ట 'అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి', 'నమస్తే', 'బి.టెక్‌ లవ్‌ స్టోరీ', 'ఐదు' వంటి చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైన గెహనాకు, అక్కడా అవకాశాలు అంతంత మాత్రంగానే వరించాయి. దీంతో హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాని వేడెక్కించినా ఫలితం లేకుండా పోయింది. ఇంక చేసేది లేక నీలి చిత్రాలను నమ్ముకుంది. నీలి చిత్రాల్లో నటిస్తూ.. ఆ వీడియోలను ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి.. సబ్‌స్ర్కిప్షన్‌ ఫీజు కింద రూ. 2000 వసూలు చేస్తున్న గెహనా వశిష్ట అండ్‌ టీమ్‌ను తాజాగా ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.


పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం.. గెహనా వశిష్టకు సంబంధించిన సుమారు 87 నీలి చిత్రాలు ఆ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, వాటిని చూసేందుకు వీక్షకుల నుంచి రూ. 2000 ఫీజు వసూలు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆమెను, ఆమెతో నీలి చిత్రాలను నిర్మిస్తున్నవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్‌లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి తర్వాత ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలియంది కాదు. ఆ తర్వాత డ్రగ్స్‌ కోణంలో బాలీవుడ్‌ అట్టుడికింది. ఇప్పుడు మళ్లీ గెహనా వశిష్ట విషయంలో బాలీవుడ్‌ మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

Updated Date - 2021-02-07T23:25:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!