ఐదు కథలు...12మంది తారలు
ABN , First Publish Date - 2021-08-06T07:19:31+05:30 IST
హీరో నాని సోదరి దీప్తీ గంటా దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘మీట్ క్యూట్’. ఐదు కథల సంకలంగా రూపొందుతోంది. ఇందులో మొత్తం పన్నెండుమంది తారలు...
హీరో నాని సోదరి దీప్తీ గంటా దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘మీట్ క్యూట్’. ఐదు కథల సంకలంగా రూపొందుతోంది. ఇందులో మొత్తం పన్నెండుమంది తారలు... ఆరుగురు హీరోయిన్లు రోహిణి, ఆదా శర్మ, ఆకాంక్షా సింగ్, రుహానీ శర్మ, సునైన, సంచితా పూనాచాతో పాటు ఆరుగురు నటులు సత్యరాజ్, అశ్విన్కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడు.