జాగ్రత్త... దొంగలున్నారు
ABN , First Publish Date - 2021-09-20T12:35:52+05:30 IST
శ్రీ సింహ కోడూరి హీరోగా నటిస్తున్న మూడో చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది...

శ్రీ సింహ కోడూరి హీరోగా నటిస్తున్న మూడో చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’ షూటింగ్ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినిమా కథ, సాంకేతిక బృందాన్ని పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకుడు. సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రీతీ అస్రానీ కథానాయిక. డి. సురే్షబాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రోహిత్ కులకర్ణి సంగీతం అందిస్తున్నారు.