‘మడ్డీ’లో అవి నచ్చాయి.. అందుకే: దిల్రాజు
ABN , First Publish Date - 2021-12-09T03:24:20+05:30 IST
భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం ‘మడ్డీ’. డిసెంబర్ 10న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రై.లి పతాకంపై దిల్రాజు భారీగా విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని
భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం ‘మడ్డీ’. డిసెంబర్ 10న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రై.లి పతాకంపై దిల్రాజు భారీగా విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్తో ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. పీకే7 క్రియేషన్స్ బ్యానర్పై ప్రేమ కృష్ణదాస్ నిర్మించారు. ఈ చిత్ర విడుదల విశేషాలను తెలియజేసేందుకు బుధవారం దిల్ రాజు, చిత్ర దర్శకుడు ప్రగభల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో దిల్రాజు మాట్లాడుతూ.. ‘‘మడ్డీ సినిమా మేకింగ్ వీడియోలు మరియు టీజర్, ట్రైలర్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని అనుకున్నాం. మేకింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న మడ్డీ అన్ని భాషల్లో సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది..’’ అని తెలుపగా.. దర్శకుడు డా. ప్రగభల్ మాట్లాడుతూ.. ‘‘ఒక యూనిక్ మూవీని ప్రేక్షకులకు అందించాలని మా టీమ్.. సుమారు ఐదేళ్లు కష్టపడి ఈ మూవీని తెరకెక్కించాం. ఆఫ్ రోడ్ మడ్ రేస్ అనేది భారతదేశంలో కొత్త కాన్సెప్ట్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఈ మూడు స్టేజెస్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఈ కథకి యాప్ట్ అయ్యే ఆర్టిస్టులు, ప్రాంతాల్ని ఎంచుకోవడం ఛాలెంజింగ్గా అనిపించింది. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. రాక్షసన్ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటర్గా కేజీ రతీష్ సినిమాటోగ్రఫర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్రాజుగారికి థ్యాంక్స్. తప్పకుండా ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుంది’’ అని అన్నారు.