ధర్మస్థలి.. టైటిల్తోనే క్రేజ్ వచ్చేసింది
ABN , First Publish Date - 2021-12-27T06:25:33+05:30 IST
షకలక శంకర్, పావని జంటగా నటించిన చిత్రం ‘ధర్మస్థలి’. రమణ మోగిలి దర్శకుడు. ఎం.ఆర్.రావు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది...

షకలక శంకర్, పావని జంటగా నటించిన చిత్రం ‘ధర్మస్థలి’. రమణ మోగిలి దర్శకుడు. ఎం.ఆర్.రావు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘షకలక శంకర్ ఇమేజ్ మార్చే సినిమా ఇది. ధర్మస్థలి అనే టైటిల్ నిర్ణయించగానే ఈ సినిమాకి క్రేజ్ వచ్చేసింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కి మంచి స్పందన వచ్చింద’’న్నారు.