క్రైమ్ థ్రిల్లర్
ABN , First Publish Date - 2021-10-18T09:34:47+05:30 IST
ఆది సాయికుమార్ హీరోగా శివశంకర్ దేవ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చాగంటి ప్రొడక్షన్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు....

ఆది సాయికుమార్ హీరోగా శివశంకర్ దేవ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చాగంటి ప్రొడక్షన్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఆదిపై తొలి సన్నివేశానికి కేఎస్ రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, పుస్కూర్ రామ్మోహన్రావు క్లాప్ ఇచ్చారు. నవంబర్ రెండో వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ‘‘క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. డిఫరెంట్గా ఉంటుంది’’ అని శివశంకర్ దేవ్ చెప్పారు. ఈ చిత్రంలో పోలీస్ రోల్ చేస్తున్నానని అలీ రేజా తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేశ్బాబు, సాయికుమార్, లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.