‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమాపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-08-03T19:11:59+05:30 IST
‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్ర బృందంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవేంకటేశ్వరస్తామిని పవిత్రంగా కీర్తించే ‘భజగోవిందం’ కీర్తనతో బెడ్ రూమ్ సన్నివేశాలను అసభ్యంగా చిత్రీకరించి, శ్రీ కృష్ణ పరమాత్మను, తులసీ మాతను కించపరిచేలా సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయనీ, అవి హిందువుల విశ్వాసాలను గాయపరుస్తున్నాయని విహెచ్పి రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతన శశిధర్, బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా రెండు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు.

‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్ర బృందంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీవేంకటేశ్వరస్తామిని పవిత్రంగా కీర్తించే ‘భజగోవిందం’ కీర్తనతో బెడ్ రూమ్ సన్నివేశాలను అసభ్యంగా చిత్రీకరించి, శ్రీ కృష్ణ పరమాత్మను, తులసీ మాతను కించపరిచేలా సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయనీ, అవి హిందువుల విశ్వాసాలను గాయపరుస్తున్నాయని విహెచ్పి రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతన శశిధర్, బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ పోచంపల్లి గిరిధర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా రెండు లిఖిత పూర్వక ఫిర్యాదులు చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ అభ్యంతరకరంగా ఉందని, దర్శకనిర్మాతలతోపాటు చిత్ర యూనిట్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే ఈ నెల 6న సినిమా విడుదల అడ్డుకుంటామని చిత్ర యూనిట్ను హెచ్చరించారు. విహెచ్పి నేతలు పురుషోత్తమా చార్యులు, కల్వ బాలరాజ్, ఆకాశ్ వాగ్మే, మహేష్ మారుపాకుల, నాగేంద్ర, మందాటి భాను చందర్ తదితరులు వనస్థలీపురం సిఐ మురళీ మోహన్ ను కలిసి ఫిర్యాదు చేసారు. వై. యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సి.హెచ్ గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు.