మెహరిన్కి పిలుపొచ్చింది
ABN , First Publish Date - 2021-11-29T11:11:39+05:30 IST
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈచిత్రంలో కథానాయికగా మెహరిన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం...

నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈచిత్రంలో కథానాయికగా మెహరిన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. నిజానికి ఈ సినిమా కోసం ముందుగా కాజల్ని ఎంచుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో కాజల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తరవాత అమలాపాల్ పేరు పరిశీలనకు వచ్చింది. చివరికి మెహరిన్ని టీమ్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగ్ సినిమాలో నటించడం మెహరిన్కి ఇదే తొలిసారి. ఇదో వైవిధ్యభరితమైన కథ. నాగార్జున పాత్ర, గెటప్ కొత్తగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇది వరకే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.