సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బిపిన్ రావత్ మృతి తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించింది: పవన్ కల్యాణ్

ABN, First Publish Date - 2021-12-09T02:45:36+05:30

అత్యున్నతమైన సీడిఎస్ బాధ్యతలను స్వీకరించిన తొలి అధికారి అయిన జనరల్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం. త్రివిధ దళాలను సమన్వయపరచి దేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరచే కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన మృతి దేశానికి తీరని లోటు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘అత్యున్నతమైన సీడిఎస్ బాధ్యతలను స్వీకరించిన తొలి అధికారి అయిన జనరల్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం. త్రివిధ దళాలను సమన్వయపరచి దేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరచే కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన మృతి దేశానికి తీరని లోటు..’’ అని అన్నారు జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్. ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మరణించిన వారికి ఆయన నివాళులు అర్పించారు.


‘‘ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో మన దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణించడం తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించింది. ఈ ఘటన అత్యంత బాధాకరం. అత్యున్నతమైన సీడిఎస్ బాధ్యతలను స్వీకరించిన తొలి అధికారి అయిన జనరల్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం. త్రివిధ దళాలను సమన్వయపరచి దేశ రక్షణ వ్యవస్థను పటిష్టపరచే కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన మృతి దేశానికి తీరని లోటు. జనరల్ రావత్, ఆయన సతీమణి శ్రీమతి మధులికలతో పాటు మరో పదకొండు మంది రక్షణ దళాల అధికారులు ఈ దుర్ఘటనలో మరణించడం దిగ్ర్భాంతి కలిగించింది. వీరిలో చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ సాయితేజ ఉన్నారని తెలిసి బాధపడ్డాను. వీరి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా తరపున, జనసేన పక్షాన నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కోలుకోవాలని కోరుకుంటున్నాను...’’ అని పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.



Updated Date - 2021-12-09T02:45:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!