'భీమ్లా నాయక్‌': ‘అడవి తల్లి’ పాట పాడిన ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వను చూశారా..

ABN , First Publish Date - 2021-12-05T13:19:03+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్‌'. తాజాగా ఈ సినిమా నుంచి 'అడవి తల్లి' అనే పాట విడుదలై రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ ట్రెండ్ అవుతోంది.

'భీమ్లా నాయక్‌': ‘అడవి తల్లి’ పాట పాడిన ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వను చూశారా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్‌'. తాజాగా ఈ సినిమా నుంచి 'అడవి తల్లి' అనే పాట విడుదలై రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతూ ట్రెండ్ అవుతోంది. ఈ పాట పాడిన ఆ కొత్త గొంతు ఎవరిదా ..అని అందరూ ఆరా తీస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సాహితి చాగంటితో పాటు కుమ్మరి దుర్గవ్వ ఈ పాటను పాడారు. ఇద్దరు హీరోల పాత్రలను తెలిపేలా ఉన్న ఈ పాట ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ పాట పాడిన ఫోక్ సినిగర్ కుమ్మరి దుర్గవ్వ మంచిర్యాల జిల్లాకు చెందినది. ఆమె చదువుకోలేదు. అయినా తెలుగుతో పాటు మరాఠీలోనూ ఎన్నో పాటలు పాడారు. దుర్గవ్వ పాడిన 'ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే', 'సిరిసిల్లా చిన్నది' వంటి పాటలు మంచి పాపులర్ అయ్యాయి. ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమాలోని 'అడవి తల్లి' పాటతో దేశవ్యాప్తంగా అందరికీ ఆమె టాలెంట్ తెలిసింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఇందులో హీరోయిన్స్‌గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించారు. జనవరి 12న భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  

Updated Date - 2021-12-05T13:19:03+05:30 IST