సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bheemlaa nayak: 'అడవి తల్లి మాట' సాంగ్ రిలీజ్ పోస్ట్‌పోన్

ABN, First Publish Date - 2021-12-01T14:17:16+05:30

'భీమ్లా నాయక్' చిత్రం నుంచి ఈరోజు రావాల్సిన సాంగ్‌ను చిత్రబృదం పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'భీమ్లా నాయక్' చిత్రం నుంచి ఈరోజు రావాల్సిన సాంగ్‌ను చిత్రబృదం పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే, 'భీమ్లా నాయక్' మూవీ నుంచి ఈరోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చెయ్యాల్సిన 'అడవి తల్లి మాట' అనే సాంగ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నారు. ఇందుకు కారణం ప్రముఖ సాహిత్య రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారి అకాల మరణమేనని తెలుస్తుంది. ఇలాంటి సమయంలో మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో సీతారామ శాస్త్రి గారి గౌరవార్ధం సాంగ్ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.  

Updated Date - 2021-12-01T14:17:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!