ఆనంద్ దేవరకొండ ‘హైవే’.. ఎంత వరకు వచ్చిందంటే..
ABN, First Publish Date - 2021-10-09T01:12:37+05:30
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘హైవే’. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘హైవే’. మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అద్భుతమైన లొకేషన్స్లో చిత్రీకరణ జరిపినట్లుగానూ, ప్రస్తుతం షూటింగ్ పార్ట్ అంతా పూర్తయినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ తాజాగా చిత్రయూనిట్ ఓ పోస్టర్ని విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ.. ‘‘మా బేనర్పై ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్గా ‘హైవే’ రూపొందుతోంది. 118 వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుహన్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మా సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి పాజిటివ్ వైబ్స్ నెలకొని ఉన్నాయి. షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో షూటింగ్ జరిపాం. ఈ సినిమాలో కొంత మంది ప్రముఖ నటీనటులు యాక్ట్ చేశారు వారి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని తెలుపగా.. చిత్ర దర్శకుడు కేవీ గుహన్ మాట్లాడుతూ.. ‘‘హైవే నేపథ్యంలో సాగే ఒక సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ప్రతిక్షణం ట్విస్టులు, టర్నులతో ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో కొన్ని క్రేజీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం’’ అన్నారు.