నిజమైన పాన్ ఇండియా చిత్రం.. నా ‘ఒక్క క్షణం’: అల్లు శిరీష్

ABN , First Publish Date - 2021-12-30T02:48:31+05:30 IST

అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో అల్లు శిరీష్ ట్విట్టర్ వేదికగా.. నిజమైన పాన్ ఇండియా చిత్రం నా ‘ఒక్క క్షణం’ చిత్రమే అని ట్వీట్ చేశారు. అదెలాగో కూడా

నిజమైన పాన్ ఇండియా చిత్రం.. నా ‘ఒక్క క్షణం’: అల్లు శిరీష్

అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో అల్లు శిరీష్ ట్విట్టర్ వేదికగా.. నిజమైన పాన్ ఇండియా చిత్రం నా ‘ఒక్క క్షణం’ చిత్రమే అని ట్వీట్ చేశారు. అదెలాగో కూడా క్లారిటీగా వివరించాడు శిరీష్.


‘‘ఒక్క క్షణం చిత్రం అప్పుడే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది ఎప్పుడు నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాలలోకి ఇది బెస్ట్ ఫిలిం. హిందీలో ‘షూర్ వీర్ 2’ పేరుతో అనువాదమై అక్కడ యూట్యూబ్, టీవీలో అతి పెద్ద విజయం సాధించింది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో ‘అంద ఓరు నిమిదం’ పేరుతో తమిళంలో విడుదలైంది. స్టార్ విజయ్‌లో ఎక్కువ సార్లు ఈ సినిమాను ప్రసారం చేశారు. అలాగే హాట్ స్టార్‌లో కూడా తమిళ వర్షన్ మంచి విజయం సాధించింది. మలయాళంలో విడుదలై అక్కడ కూడా ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుందీ చిత్రం. 4 విభిన్నమైన భాషల్లో మంచి అప్లాజ్ అందుకున్న ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను ప్రేక్షకులకు అందించినందుకు నాకు, దర్శకుడు వి.ఐ. ఆనంద్‌కు గర్వంగా ఉంది. అందుకే దీన్ని నిజమైన పాన్ ఇండియా సినిమా అంటున్నాను. ఈ సినిమా 4 సంవత్సరాల సెలబ్రేషన్‌కు ఇంతకంటే సంతోషకరమైన కారణాలు అవసరం లేదు. సినిమా పట్ల ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను..’’ అని అల్లు శిరీష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2021-12-30T02:48:31+05:30 IST