రచయితగా అజయ్ ఘోష్
ABN , First Publish Date - 2021-07-19T09:08:58+05:30 IST
నటుడు అజయ్ ఘోష్ రచయితగా మారారు. ఓ చిత్రానికి ఆయన మూలకథ అందించారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది....

నటుడు అజయ్ ఘోష్ రచయితగా మారారు. ఓ చిత్రానికి ఆయన మూలకథ అందించారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. ఆగస్టు 2 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. చిత్రనిర్మాతలు నండూరి శ్రీను, నండూరి రాము మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో అజయ్ ఘోష్, శుభోదయం సుబ్బారావు, ‘పలాస’ ఫేమ్ జనార్ధన్ రావు ప్రధాన పాత్రధారులు. అలనాటి ప్రముఖ రంగస్థల కాళాకారులు, మా తండ్రిగారు యన్.వి.ఎల్ నరసింహచార్యులు పేరు మీద యన్.వి.ఎల్ ఆర్ట్స్ సంస్థ స్థాపించి, తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: దంతులూరి నరసింహమూర్తి రాజు, దర్శకత్వం: మహేశ్ బంటు.