క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన విజేతలు

ABN , First Publish Date - 2021-12-20T22:58:16+05:30 IST

మిర్చి, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి హంసా నందిని. తనకు ఇటీవల క్యాన్సర్ సోకిందని

క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన విజేతలు

మిర్చి, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి హంసా నందిని. తనకు ఇటీవల క్యాన్సర్ సోకిందని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా ఆమె సోమవారం తెలిపింది. ప్రస్తుతం తను క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నానని  త్వరలోనే కోలుకుని తిరిగి వస్తానని ఆమె పేర్కొంది. గతంలో ఎంతోమంది సెలెబ్రిటీలు క్యాన్సర్‌తో పోరాడి తిరిగి కోలుకున్నారు. ఆ విధంగా క్యాన్స్‌ర్‌ను పోరాడి గెలిచిన వారిపై  ఓ లుక్కేద్దామా.. 


సోనాలి బింద్రే :

మన్మథుడు, ఇంద్ర వంటి సినిమాల్లో నటించి తెలుగు వారికి చేరువైన నటి సోనాలి బింద్రే . 2020, జులైలో ఆమె క్యాన్సర్ బారిన పడినట్టు  ప్రకటించింది. అనంతరం క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. ప్రస్తుతం ఆ వ్యాధితో బాధపడేవారికి  అండగా నిలబడుతుంది. 


అనురాగ్ బసు : 

మర్డర్, గ్యాంగ్ స్టర్, బర్ఫీ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు. ఆయన బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా) బారిన పడ్డారు. రక్తంలో తెల్లరక్త కణాలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో పోరాడి ఆయన గెలిచారు. అనంతరం దర్శకుడిగా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 


లీసా రే : 

మోడల్, నటి అయిన లీసా రే‌  దశాబ్దం క్రితం క్యాన్సర్ బారిన పడింది. ప్లాస్మా సెల్‌లో ఏర్పాడే మల్టిఫుల్ మైలోమా అనే క్యాన్సర్ ఆమెకు సోకింది. దాదాపుగా ఏడాదికి పైగా ఆ వ్యాధికి చికిత్స తీసుకుంది. అనంతరం దానితో పోరాడి గెలిచింది. 


మనీషా కోయిరాలా : 

నేపాలీ నటిగా చిత్రాల్లోకి అడుగుపెట్టి తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి మనీషా కోయిరాలా. 2012లో ఓవరియన్ క్యాన్సర్‌తో పోరాడి ఆమె గెలిచింది. అనంతరం ఆ అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా ఆమె తెలియజేస్తుంది. క్యాన్సర్ బాధితులకు భరోసా కల్పిస్తుంది. 


రాకేశ్ రోషన్: 

హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ గొంతు క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ క్యాన్సర్ 2019, జనవరిలో ఆయనకు సోకింది. కొంతకాలం ఆ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నారు. అనంతరం సర్జరీ చేయించుకుని ఆ వ్యాధితో పోరాడి గెలిచారు. నిర్మాతగా బాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని అలుపెరగకుండా కొనసాగిస్తున్నారు. 


మమతా మోహన్‌దాస్ :

యమ దొంగ సినిమాలో తారక్ సరసన నటించి తెలుగు వారికి దగ్గరైన నటి మమతా మోహన్ దాస్. 2010లో ఆమెకు క్యాన్సర్ సోకింది. ఆ సంవత్సరమే ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటిగా ఆమె అవార్డు గెలుచుకుంది. కొన్ని ఏళ్ల పాటు క్యాన్సర్‌‌కు ఆమె  చికిత్స తీసుకుంది. అనంతరం సినిమా కెరీర్‌ను మరల 2015లో మొదలుపట్టింది.  


గౌతమి : 

తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన నటి గౌతమి. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ఆ సమయంలో ఆమె సినిమా కెరీర్ పీక్‌లో ఉంది. కొన్నా‌ళ్లు ఆ వ్యాధితో పోరాడి గెలిచింది. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్‌పై ఆమె అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. 


యువరాజ్ సింగ్ : 

6 బంతుల్లో 6 సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ . ఆయనకు లంగ్ క్యాన్సర్ సోకింది. ఎడమ ఊపిరితిత్తిలో ట్యూమర్ ఉందని 2011లో బయటపడింది. ఆ వ్యాధితో పోరాడి ఆయన గెలిచారు. 

Updated Date - 2021-12-20T22:58:16+05:30 IST