భానుప్రియ చెల్లెలు రీ‌ఎంట్రీ

ABN , First Publish Date - 2021-12-05T20:37:08+05:30 IST

టాలీవుడ్ సీనియర్ నటీమణి భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ గుర్తుందా? తెలుగులో ‘మహర్షి’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. అంతకు ముందే తమిళంలో నిషాంతి పేరుతో ఇంట్రడ్యూస్ అయ్యారు ఆమె. అక్కడ కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆపై ‘సౌగంధ్’ సినిమాతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆరేడు సినిమాల్లో నటించారు. 1994లో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు శాంతి ప్రియ. ఆమె నటించిన ఆఖరి సినిమా ‘ఇక్కేపే ఇక్కా’ హిందీ చిత్రం.

భానుప్రియ చెల్లెలు రీ‌ఎంట్రీ

టాలీవుడ్ సీనియర్ నటీమణి భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ గుర్తుందా? తెలుగులో ‘మహర్షి’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.  అంతకు ముందే తమిళంలో నిషాంతి పేరుతో ఇంట్రడ్యూస్ అయ్యారు ఆమె. అక్కడ కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆపై  ‘సౌగంధ్’ సినిమాతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆరేడు సినిమాల్లో నటించారు. 1994లో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు శాంతి ప్రియ. ఆమె నటించిన ఆఖరి సినిమా ‘ఇక్కేపే ఇక్కా’ హిందీ చిత్రం. దాదాపు 27 ఏళ్ళ తర్వాత మళ్ళీ శాంతి ప్రియ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఓ వెబ్ సిరీస్ తో. అందులోనూ బాలీవుడ్ లో. 


సునీల్ శెట్టి హీరోగా నటిస్తున్న ‘ధారావి బ్యాంక్’ అనే వెబ్ సిరీస్ లో శాంతి ప్రియ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సమిత్ కక్కడ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జీస్డూడియోస్ వారు నిర్మిస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ ఎమెక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ కాబోతోంది. సోనాలీ కులకర్ణి, వివేక్ ఒబెరాయ్, ఫ్రెడ్డీ దరూవాలా, సంతోష్ జువేకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ లో శాంతిప్రియ ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ శాంతిప్రియను తిరిగి బాలీవుడ్ లో బిజీ చేస్తుందో లేదో చూడాలి. 

Updated Date - 2021-12-05T20:37:08+05:30 IST