కాంట్రవర్సీ క్వీన్ Kangana Ranaut.. ఏడాది కాలంలో వివాదాల్లో నిలిచిన సందర్భాలు..

ABN , First Publish Date - 2021-11-16T17:13:49+05:30 IST

బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘స్వాతంత్ర్యం’పై చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇలా ఈ బ్యూటీ యాక్టర్‌గానే కాకుండా..

కాంట్రవర్సీ క్వీన్ Kangana Ranaut..  ఏడాది కాలంలో వివాదాల్లో నిలిచిన సందర్భాలు..

బాలీవుడ్ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘స్వాతంత్ర్యం’పై చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇలా ఈ బ్యూటీ యాక్టర్‌గానే కాకుండా.. కాంట్రవర్సీలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఇలా కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం ఈ భామకి మొదటి సారేం కాదు. ఇప్పటి వరకూ ఈ తార వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలపై ఓ లుక్కేద్దాం రండి..



కంగనా రనౌత్ Vs దిల్జీత్ దోసాంజే

గతేడాది రైతుల నిరసనలు తారాస్థాయికి చేరినప్పుడు కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె రైతులను "ఉగ్రవాదులు" అని పేర్కొంది. ఈ విషయంలో ఆమెపై పోలీసు ఫిర్యాదు కూడా నమోదైంది. దీనిపై పంజాబీ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజే స్పందించాడు.



కంగనా రనౌత్ ఓ సిక్కు మహిళ గురించి తప్పుడు సమాచారాన్ని ట్వీట్ చేయడంతో ట్విట్టర్‌లో మాటల యుద్ధం ప్రారంభమైంది. ‘ఆ మహిళ రూ. 100 సంపాదించడానికి నిరసనలో పాల్గొన్నట్లుగా తెలిపింది. అయితే అదే మహిళ ఇంతకుముందు షాహీన్ బాగ్ దాది, బిల్కిస్ బానోగా ప్రజాదరణ పొందింది’ అంటూ ఈ బ్యూటీ పోస్ట్ చేయగా.. అసలు ఈ మహిళ ఎవరో దిల్జిత్ రుజువును షేర్ చేశాడు.



దీనికి రిప్లైగా కంగనా అతన్ని ‘కరణ్ ​​జోహార్ పెంపుడు జంతువు’ అని పిలిచింది. దీనికి ‘నువ్వు ఎవరితో పనిచేసినా వారి పెంపుడు జంతువుగా అయిపోతావా? అయితే ఆ జాబితా చాలా పొడవుగా ఉంటుంది. ఇది బాలీవుడ్ కాదు, ఇది పంజాబ్. ప్రజల  భావోద్వేగాలకు గౌరవం ఇవ్వండి’ అంటూ  దిల్జిత్ తెలిపాడు.


కంగనా రనౌత్ vs జస్టిన్ రావు

రాజ్‌కుమార్ రావుతో పాటు కంగనా ప్రధాన పాత్రలో నటించిన జడ్జిమెంటల్ హై క్యా ప్రమోషన్‌ల సందర్భంగా, జస్టిన్ రావు అనే జర్నలిస్ట్ తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నాడని ఈ బ్యూటీ ఆరోపించింది. ఎందుకంటే ఆమె మణికర్ణిక సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు. నటి మాట్లాడుతూ ‘మీరు నా సినిమా మణికర్ణికపై రాద్ధాంతం చేస్తున్నారు. నేను సినిమా తీసి తప్పు చేశానా? జాతీయవాదంపై సినిమా తీసినందుకు నన్ను జింగోయిస్టిక్ వ్యక్తి అని పిలుస్తున్నారు" అని ఆరోపించింది.


జస్టిన్ స్పందిస్తూ కంగనా అన్యాయంగా మాట్లాడుతోంది. సమీక్ష అనేది వ్యక్తిగతమైనది. ఇది దృక్పథానికి సంబంధించిన విషయం. అంతే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కంగనాతో పాటు జడ్జిమెంటల్ హై క్యా నిర్మాతలైన బాలాజీ టెలిఫిల్మ్స్‌ని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లేఖ రాయగా.. వారు క్షమాపణలు చేశారు.


కంగనా రనౌత్ vs సంజయ్ రౌత్

ముంబై తనకు సురక్షితంగా లేదని కంగనా చెప్పిన సమయం గుర్తుందా?.. ఆ సమయంలో కంగనా రనౌత్..‘శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నన్ను బహిరంగంగా బెదిరించాడు. ముంబైకి తిరిగి రావద్దని చెప్పాడు. ముంబై వీధుల్లో ఆజాదీ గ్రాఫిటీస్, ఇప్పుడు బహిరంగ బెదిరింపులు, ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ లాగా అనిపిస్తోంది?’ అంటూ ఘాటు విమర్శించింది.


దీనిపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘కంగనా రనౌత్ మానసిక సమస్యలు ఉన్న వ్యక్తి. ఆమె తినే ప్లేట్‌లో ఉమ్మి వేస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇస్తున్నాయి. ఆమెను పీఓకేకి వెళ్లనివ్వండి. ఆమె రెండు రోజుల పీఓకే పర్యటనకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. ప్రభుత్వం చేయకపోతే.. ఆ పర్యటనకు అయ్యే ఖర్చును భరించడానికి మేము సిద్ధంగా ఉన్నా’మంటూ కౌంటర్ ఇచ్చారు.


కంగనా రనౌత్ vs వరుణ్ గాంధీ

ఇటీవలే పద్మశ్రీ అందుకున్న కంగనా రనౌత్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘1947లో భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం రాలేదని.. 2014లో వచ్చినట్లు’ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. దీనిపై బీజేపీ నాయకుడు వరుణ్ ‌గాంధీ మాట్లాడుతూ.. ఇది గాంధీ,  మంగళ్ పాండే నుంచి రాణి లక్ష్మీబాయి, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ వరకు లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు అవమానం అంటూ తెలిపారు.


కంగనా రనౌత్ vs ట్విట్టర్

మే 2న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న హింసాత్మక హింసాకాండపై కంగనా విమర్శలు చేసింది. ప్రతీకార హింసకు పిలుపునిస్తున్నట్లు కనిపిస్తుందంటూ ట్విట్టర్ ఈ బ్యూటీ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది.

Updated Date - 2021-11-16T17:13:49+05:30 IST