సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కార్గిల్‌లో హీరో.. ముంబైలో హీరోయిన్‌!

ABN, First Publish Date - 2021-07-26T03:54:31+05:30

కేవలం ఒక్కరోజు చిత్రీకరణ కోసం రష్మికా మందన్నా ఆదివారం ముంబై వెళ్లారు. అయితే... హీరో ముంబైలో లేరు. ఆయనేమో కార్గిల్‌ వెళ్లారు. కేవలం కథానాయికపై సన్నివేశాలను మాత్రమే ఆదివారం చిత్రీకరించారు. హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాకు జంటగా రష్మిక నటిస్తున్న చిత్రం ‘మిషన్‌ మజ్ను’.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేవలం ఒక్కరోజు చిత్రీకరణ కోసం రష్మికా మందన్నా ఆదివారం ముంబై వెళ్లారు. అయితే... హీరో ముంబైలో లేరు. ఆయనేమో కార్గిల్‌ వెళ్లారు. కేవలం కథానాయికపై సన్నివేశాలను మాత్రమే ఆదివారం చిత్రీకరించారు. హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాకు జంటగా రష్మిక నటిస్తున్న చిత్రం ‘మిషన్‌ మజ్ను’. ఆదివారం ముంబైలో చిత్రీకరణ జరిగింది. అందులో రష్మిక పాల్గొన్నారు. మరోవైపు ‘ద షెర్షా ఆఫ్‌ కార్గిల్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం కోసం సిద్ధార్థ్‌ మల్హోత్రా కార్గిల్‌ వెళ్లారు. అందులో కథానాయిక కియారా అడ్వాణీ, నిర్మాత కరణ్‌ జోహార్‌, ఇతర చిత్రబృందంతో కలిసి ప్రైవేట్‌ జెట్‌లో ఆదివారం ఉదయం ముంబై నుంచి బయలుదేరారు. కార్గిల్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘ఓ రోజు ‘మిషన్‌ మజ్ను’ చిత్రీకరణ కోసం ముంబై వచ్చాను’’ అని రష్మిక పేర్కొన్నారు. ముంబై నుంచి తిరిగి వచ్చీ రావడమే, సోమవారం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రీకరణలో జాయిన్‌ కానున్నారు. శర్వానంద్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 

Updated Date - 2021-07-26T03:54:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!