వామ్మో.. ఈ పెయింటింగ్ ఖరీదు అన్ని కోట్లా..
ABN, First Publish Date - 2021-11-08T21:08:51+05:30
సెలెబ్రిటీలు అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలైతే ఆ ఆసక్తి ఆకాశాన్ని అంటుతుంది. ఏ వస్తువులను వాడుతున్నారు, ఏమీ తింటున్నారు
సెలెబ్రిటీలు అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలైతే ఆ ఆసక్తి ఆకాశాన్ని అంటుతుంది. ఏ వస్తువులను వాడుతున్నారు, ఏమి తింటున్నారు అనే ప్రతి విషయాన్ని అభిమానులు గమనిస్తూ ఉంటారు. అందుకనుగుణంగా వారు వాడే వస్తువుల ఖరీదు కూడా అధికంగానే ఉంటుంది. తాజాగా అమితాబ్ బచ్చన్ ఇంట్లో కోట్ల విలువ చేసే ఒక పెయింటింగ్ను ఫ్యాన్స్ గుర్తించారు. ప్రస్తుతం ఆ పెయిటింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ పెయింటింగ్ ఖరీదుతో బెంగళూరులో 3బీహెచ్కే ప్లాట్ను కొనుగోలు చేయవచ్చంటే అతిశయోక్తి కాదు.
బిగ్బీ అమితాబ్ బచ్చన్ దీపావళి సంబరాలను చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలో బాలీవుడ్ షెహన్షా కుటుంబం మొత్తం దర్శనమిచ్చింది. వారి వెనుక భాగంలో ఒక పెయింటింగ్ కనిపించింది. ప్రస్తుతం దాని గురించే నెటజన్లందరూ చర్చించుకుంటున్నారు. ఈ ఫొటోలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య, శ్వేత బచ్చన్, నవ్య, అగస్త్య తదితరులున్నారు. ఈ పెయింటింగ్ ఖరీదు దాదాపుగా రూ. 3కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుందని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పెయింటింగ్ను మంజిత్ బవా అనే చిత్రకారుడు వేశారు.