సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు

ABN, First Publish Date - 2021-09-18T04:40:52+05:30

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 25న విచారణకు హాజరవ్వాలని తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 25న విచారణకు హాజరవ్వాలని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ ఈడీ విచారణలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరు బయటపెట్టాడు. దాంతో ఆగస్టులో ఆమెను ఈడీ ఆరుగంటల పాటు విచారించింది. కేసులో ఆమె పాత్రను నిగ్గు తేల్చేందుకు ఈడీ మరోసారి జాక్వెలిన్‌ను ప్రశ్నించాలని భావించింది. అయితే ఈ కేసులో ఆమె సూత్రధారి కాదు బాధితురాలు మాత్రమే అని జాక్వెలిన్‌ సన్నిహితులు చెపుతున్నారు.

Updated Date - 2021-09-18T04:40:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!