మీ వల్లే నాకు వాటిపై ఇష్టం పెరిగింది.. ఈ సారి కూడా మీకు నచ్చుతుంది: భూమి పడ్నేకర్
ABN, First Publish Date - 2021-11-18T22:01:25+05:30
బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గోవింద నామ్ హై మేరా’. అందులో ఇద్దరూ హీరోయిన్లు. ఒకరు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో..
బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గోవింద నామ్ హై మేరా’. ఇందులో ఇద్దరూ హీరోయిన్లు. ఒకరు సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’తో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కియారా అడ్వాణీ కాగా.. మరొకరు బాలీవుడ్ మూవీ ‘పతి పత్ని ఔర్ వో’ ఫేమ్ భూమీ ఫడ్నేకర్. ఈ సినిమాలో భూమీ భార్యగా పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఈ బ్యూటీ ఈ మూవీలోని తన లుక్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.
భూమీ మాట్లాడుతూ.. ‘చీరలో నేను ప్రేక్షకులకి అందంగా కనిపిస్తే.. దాన్ని కాంప్లిమెంట్గా భావిస్తా. అవకాశం ఉన్నప్పుడు వాటిని ధరించడం నాకు చాలా ఇష్టం. కొన్ని సినిమాల్లో వాటిని వేసుకోవడం ఆనందంగా ఉంది.
నేను ‘పతి పత్ని ఔర్ వో’ అనే మూవీలో చీరని ధరించగా.. అందరికి విపరీతంగా నచ్చింది. ఆడియన్స్ శారీలో నన్ను ఇష్టపడడం వల్ల వాటిపై నాకు ప్రేమ పెరిగింది. ‘గోవింద నామ్ హై మేరా’ సినిమాలోనూ చీరలో ఉన్న నా క్యారెక్టర్ని మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. అయితే ఈ రెండు సినిమాల్లో భార్యగానే నటించిన.. రెండు పాత్రలకు చాలా తేడా ఉంటుంద’ని చెప్పింది.