88బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్క శర్మ.. బీసీసీఐ ట్వీట్‌తో ఆశ్యర్యపోయిన నెటిజన్లు

ABN , First Publish Date - 2021-11-03T21:01:17+05:30 IST

88బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్క శర్మ.. బీసీసీఐ ట్వీట్‌తో ఆశ్యర్యపోయిన నెటిజన్లు

88బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్క శర్మ.. బీసీసీఐ ట్వీట్‌తో ఆశ్యర్యపోయిన నెటిజన్లు

అనుష్క శర్మ 88బంతుల్లో 52 పరుగులు చేసింది. ఈ స్కోర్‌లో 5 ఫోర్లతో పాటు 1 సిక్సర్ కూడా ఉంది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్. ఇది ఫేక్ న్యూస్ ఏ మాత్రం కాదు. బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ మెసేజ్ దర్శనమిచ్చింది. నెటిజన్లు ఈ మెసేజ్‌ను తెగ షేర్ చేసుకుంటున్నారు. 


బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్-19 ఛాలెంజర్ ట్రోఫి జరుగుతోంది. అనుష్క శర్మ అనే ప్లేయర్ 88బంతుల్లో 52 పరుగులు చేసిందని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌తో నెటిజన్లందరూ ఆశ్యర్యపోయారు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మయే ఈ పరుగులు చేసిందని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ, నిజం ఏమిటంటే ఇండియా-బి టీమ్‌కు చెందిన అనుష్కశర్మ అనే ఉమెన్ ప్లేయర్ ఈ పరుగులు సాధించింది. 


ఛాలెంజర్ ట్రోపీలో ఇండియా-ఏ, ఇండియా-బీ, ఇండియా-సీ, ఇండియా-డీ అనే 4జట్లు తలపడుతున్నాయి. ఇండియా-బీ  జట్టుకు కెప్టెన్‌గా అనుష్కశర్మ అనే ప్లేయర్ వ్యవహరిస్తుంది. ఆమెనే ఈ పరుగులు సాధించడం విశేషం.



Updated Date - 2021-11-03T21:01:17+05:30 IST