కార్తీక్ ఆర్యన్తో మరో సినిమా!
ABN , First Publish Date - 2021-08-04T06:57:14+05:30 IST
కియారా అడ్వాణీ మరో కొత్త సినిమా అంగీకరించారని ముంబై ఖబర్. యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్తో మరో సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట...
కియారా అడ్వాణీ మరో కొత్త సినిమా అంగీకరించారని ముంబై ఖబర్. యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్తో మరో సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘చంద్రముఖి’ని హిందీలో ‘భూల్ భులయ్యా’గా రీమేక్ చేశారు. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. అందులో కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా నటిస్తున్నారు. దీని తర్వాత ‘సత్యనారాయణ్ కి కథ’లోనూ వాళ్లిద్దరూ జంటగా నటించనున్నారట. డిసెంబర్లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. దీని కంటే ముందు రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా చిత్రీకరణలో కియారా అడ్వాణీ పాల్గొంటారు. ఆమె నటించిన ‘షేర్షా’ త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. అది కాకుండా హిందీలో ‘జగ్ జగ్ జీయో’, ‘మిస్టర్ లేలే’ చేస్తున్నారు.