21 ఏళ్ల తరువాత... తాత ముందుకి అమితాబ్ మనవరాలు!
ABN, First Publish Date - 2021-11-26T18:00:38+05:30
‘కౌన్ బనేగా కరోడ్పతి’... భారతీయ టెలివిజన్ చరిత్రలో ఎంతో ప్రత్యేకం. సంవత్సరాలుగా... దశాబ్దాల తరబడి... బిగ్ బి క్విజ్ షో బిగ్ హిట్గానే కొనసాగుతోంది. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది ‘కౌన్ బనేగా కరోడ్పతి’. త్వరలో...
‘కౌన్ బనేగా కరోడ్పతి’... భారతీయ టెలివిజన్ చరిత్రలో ఎంతో ప్రత్యేకం. సంవత్సరాలుగా... దశాబ్దాల తరబడి... బిగ్ బి క్విజ్ షో బిగ్ హిట్గానే కొనసాగుతోంది. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది ‘కౌన్ బనేగా కరోడ్పతి’. త్వరలో వెయ్యో ఎపిసోడ్ ప్రసారం కానుంది. 21 ఏళ్లుగా బాలీవుడ్ షెహన్ షా దిగ్విజయంగా కార్యక్రమాన్ని నడుపుతున్నాడు. అయితే, లెటెస్ట్ స్పెషల్ ఎపిసోడ్లో అమితాబ్ కూతురు, మనవరాలు హైలైట్గా నిలువనున్నారు...
అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ నటుడిగా అందరికీ తెలుసు. ఇక బచ్చన్ పరివార్లో జయా బచ్చన్, ఐశ్వర్య బచ్చన్ కూడా మనకు తెలిసిన వారే. అయితే, మరీ ఎక్కువగా లైమ్లైట్లోకి రానిది శ్వేతా బచ్చన్. ఆమె బిగ్ బీ కూతురు. మంచి రచయిత్రి అయిన ఆమె 1997లో నిఖిల్ నందాని పెళ్లాడింది. అలా... శ్వేతా బచ్చన్ నందాగా మారిన ఆమె ‘కౌన్ బనేగా కరోడ్పతి’ వెయ్యవ ఎపిసోడ్లో హాట్సీట్పై సత్తా చాటనుంది. తనతో పాటూ శ్వేతా బచ్చన్ కూతురు నవ్యా నవేలీ నందా కూడా అమితాబ్ సంధించే ప్రశ్నల్ని ఎదుర్కోనుంది. ఈ విషయాన్ని స్వయంగా తన ఫాలోయర్స్కి తెలిపిన నవ్యా నందా, ఇన్స్టాగ్రామ్లో, కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ‘కేబీసీ’ సెట్ మీద నుంచీ తాతతో కలసి కెమెరాలకు ఫోజులిచ్చింది. 21 ఏళ్ల తరువాత... 999 ఎపిసోడ్స్ అనంతరం... అంటూ కామెంట్ చేసింది! ఓ వైపు కూతురు, మరో వైపు మనవరాలితో బిగ్ బీని చూసిన నెటిజన్స్ చాలానే ఎగ్జైట్ అయ్యారు. లెటెస్ట్ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...