‘సర్కారు వారి పాట’లో సెకండ్ హీరోయిన్.. ఎవరంటే?
ABN , First Publish Date - 2020-08-04T22:28:36+05:30 IST
సూపర్ స్టార్ మహేష్ బాబు, ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూపుదిద్దుకోనున్న చిత్రాన్ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే
![‘సర్కారు వారి పాట’లో సెకండ్ హీరోయిన్.. ఎవరంటే?](https://media.chitrajyothy.com/appimg/galleries/2020080404580226/08042020170308n88.jpg)
సూపర్ స్టార్ మహేష్ బాబు, ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూపుదిద్దుకోనున్న చిత్రాన్ని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే ఆసక్తికర టైటిల్తో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ని కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఫస్ట్ టైమ్ మహేష్ సరసన కీర్తిసురేష్ నటించబోతోంది. ఈ విషయం స్వయంగా ఆమె తెలిపింది. ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్గా చేస్తున్నానంటూ ‘మహానటి’ కీర్తిసురేష్ తెలపడంతో.. ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్కి కూడా స్కోప్ ఉందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు ‘సర్కారు వారి పాట’ సెకండ్ హీరోయిన్ అంటూ ఓ హీరోయిన్ పేరు కూడా నెట్లో ప్రకటించేశారు. పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా ఫిల్మ్గా రూపుదిద్దుకుంటున్న చిత్రంతో టాలీవుడ్కి పరిచయం అవుతున్న అనన్య పాండేని ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటింపజేసేందుకు ‘సర్కారు వారి పాట’ టీమ్ ప్రయత్నాలు చేస్తుందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడగానే ఆమెకు కథ వినిపించాలని పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ మాత్రం ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నెట్లో మాత్రం మహేష్ సరసన విజయ్ దేవరకొండ హీరోయిన్ అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.