‘మహా సముద్రం’లో మరో హీరో ఎవరంటే..?
ABN , First Publish Date - 2020-04-28T18:16:42+05:30 IST
తొలి చిత్రం ‘ఆర్.ఎక్స్ 100’తో సూపర్డూపర్హిట్ అందుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. అయితే రెండో సినిమాగా ‘మహాసముద్రం’ను తెరకెక్కించాలనుకున్నారు.
![‘మహా సముద్రం’లో మరో హీరో ఎవరంటే..?](https://media.chitrajyothy.com/appimg/galleries/2020042812450169/04282020124636n78.jpg)
తొలి చిత్రం ‘ఆర్.ఎక్స్ 100’తో సూపర్డూపర్హిట్ అందుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. అయితే రెండో సినిమాగా ‘మహాసముద్రం’ను తెరకెక్కించాలనుకున్నారు. ఈ సినిమాను ట్రాక్ ఎక్కించడానికి అజయ్ భూపతి చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ.. ఏదీ వర్కవుట్ కాలేదు. ఇందులో ఇద్దరు హీరోలుంటారు. ఓ హీరోగా నటించడానికి రీసెంట్గా శర్వానంద్ ఓకే చెప్పారు. దీంతో మరో హీరో పాత్రలో ఎవరు నటిస్తారని దర్శక నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేశారట. తాజా సమాచారం ప్రకారం ఇందులో సిద్దార్థ్ హీరోగా నటిస్తాడని టాక్. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పనులు మరింత స్పీడందుకుంటాయట.