ఓటీటీలో తమన్నా, కాజల్ చిత్రం..!
ABN , First Publish Date - 2020-07-19T17:28:46+05:30 IST
బాలీవుడ్ చిత్రం ‘క్వీన్’ సౌత్ రీమేక్. కంగనా నటించిన ‘క్వీన్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మన కుమరన్ నిర్మించారు. తెలుగు వెర్ష్న్గా రూపొందిన ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా, తమిళ వెర్షన్ ‘పారిస్ పారిస్’లో కాజల్ అగర్వాల్, కన్నడ వెర్షన్లో పారుల్ యాదవ్, మలయాళ వెర్షన్లో మంజిమ మోహన్ లీడ్ రోల్స్లో నటించారు.
![ఓటీటీలో తమన్నా, కాజల్ చిత్రం..!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020071911565066/07192020115834n96.jpg)
సౌత్ స్టార్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. అదేంటి? వీరిద్దరూ ఓ సినిమాలో కలిసి ఎప్పుడు నటించారు? అనే సందేహం సినీ ప్రేక్షకుడికి రాక మానదు. నిజానికి వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించలేదు. కానీ.. వీరిద్దరూ ఓ సినిమా రీమేక్లో వేర్వేరు వెర్షన్స్లో మెయిన్ లీడ్ను పోషించారు. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఆ సినిమా ఏదో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ చిత్రం ‘క్వీన్’ సౌత్ రీమేక్. కంగనా నటించిన ‘క్వీన్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మన కుమరన్ నిర్మించారు. తెలుగు వెర్ష్న్గా రూపొందిన ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా, తమిళ వెర్షన్ ‘పారిస్ పారిస్’లో కాజల్ అగర్వాల్, కన్నడ వెర్షన్లో పారుల్ యాదవ్, మలయాళ వెర్షన్లో మంజిమ మోహన్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా ఓటీటీలో విడుదలవుతుందని వార్తలు వినపడుతున్నాయి. తర్వలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాక్.