షాడో డైరెక్టర్ ఫిక్స్..?
ABN , First Publish Date - 2020-06-28T14:30:18+05:30 IST
ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ షాడో నవలను వెబ్ సిరీస్ రూపంలో రూపొందించనుంది.
![షాడో డైరెక్టర్ ఫిక్స్..?](https://media.chitrajyothy.com/appimg/galleries/2020062808580992/06282020085958n57.jpg)
తెలుగు సాహిత్యంలో నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో నవలలు సినిమాల రూపంలో ప్రేక్షకులను మెప్పించాయి కూడా. నవలా సాహిత్యంలో మధుబాబు రచనలకు మంచి గుర్తింపు ఉంది. ఆయన రచించిన నవలల్లో షాడో నవలకు అభిమానులెందరో. ఇప్పుడు ఆ నవల దృశ్య రూపంలో ఆవిష్కృతం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ షాడో నవలను వెబ్ సిరీస్ రూపంలో రూపొందించనుంది. ‘రాజా చెయ్యి వేస్తే’ అనే సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రదీప్ ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తాడని సినీ వర్గాల్లో సమాచారం. ఓ ప్రముఖ హీరోను నటింప చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది.