మరోసారి చిరుతో త్రిష జోడీ..!
ABN , First Publish Date - 2020-05-13T15:46:33+05:30 IST
చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’లో త్రిష జోడీ కట్టాల్సింది కానీ క్రియేటివ్ డిఫరెన్స్లున్నాయంటూ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.
![మరోసారి చిరుతో త్రిష జోడీ..!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020051310143123/05132020101609n21.jpg)
చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’లో త్రిష జోడీ కట్టాల్సింది కానీ క్రియేటివ్ డిఫరెన్స్లున్నాయంటూ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆ స్థానంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తుంది. ఈ విషయాలను పట్టించుకోకుండా చిరంజీవి మరో సినిమాలో త్రిషను హీరోయిన్గా తీసుకోనున్నారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్లే.. ‘ఆచార్య’ తర్వాత చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్తో పాటు తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్లోనూ నటించబోతున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఓ చిత్రంలో చిరుతో త్రిష జోడీ కట్టనుందని వార్తలు వినపడుతున్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలపై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.