చిరంజీవి కోసం మూడేళ్లు..!
ABN, First Publish Date - 2020-09-25T16:40:05+05:30
సినిమాల ఫలితాల సంగతెలా ఉన్నా స్టైలిష్ మేకర్గా గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు మెహర్ రమేష్.
సినిమాల ఫలితాల సంగతెలా ఉన్నా స్టైలిష్ మేకర్గా గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు మెహర్ రమేష్. మెగాఫోన్కు కొంతకాలం దూరమైన రమేష్ త్వరలో ఓ మెగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా `వేదాళం` రీమేక్ చేయబోతున్నారు.
చిరంజీవి ఇమేజ్కు, తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆ కథను మార్చారు. ఇందుకోసం మూడేళ్ల పాటు కష్టపడ్డారు. మెహర్ చేసిన మార్పులు నచ్చడంతోనే చిరంజీవి ఆ సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా గురించి పవన్ ట్విటర్ ద్వారా స్పందించారు. ఇటీవల చిరంజీవి కూడా కన్ఫామ్ చేశారు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాలని మెహర్ చాలా పట్టుదలగా ఉన్నారు.