డిజిటల్ రంగంలోకి మణిరత్నం..?
ABN , First Publish Date - 2020-06-05T17:47:16+05:30 IST
ఏస్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ను డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా ప్రభావంతో చిత్రీకరణ ఆగింది.
![డిజిటల్ రంగంలోకి మణిరత్నం..?](https://media.chitrajyothy.com/appimg/galleries/2020060512141642/06052020121653n88.jpg)
ఏస్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ను డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. షూటింగ్స్ ఓకే అయిన తర్వాత ఈ సినిమా కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఓ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే మణిరత్నం కాన్సెప్ట్ను సిద్ధం చేశారట. ఈ వెబ్సిరీస్కు మణిరత్నం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట. తన దర్శకత్వ శాఖ పనిచేసే ఒకరికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వినపడుతున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.