సూప‌ర్‌హిట్ సీక్వెల్‌లో కీర్తి సురేశ్‌..!

ABN , First Publish Date - 2020-08-07T16:05:33+05:30 IST

భారతిరాజా దర్శకత్వంలో కమల్‌హాసన్‌, శ్రీదేవి జంటగా నటించిన సూపర్‌హిట్‌ తమిళచిత్రం ‘సిగప్పు రోజాక్కల్‌’. 1978లో విడుదలైన ఈ సినిమా (తెలుగులో ఎర్రగులాబీలు) కలెక్షన్ల వర్షం కురిపించింది.

సూప‌ర్‌హిట్ సీక్వెల్‌లో కీర్తి సురేశ్‌..!

భారతిరాజా దర్శకత్వంలో కమల్‌హాసన్‌, శ్రీదేవి జంటగా నటించిన సూపర్‌హిట్‌ తమిళచిత్రం ‘సిగప్పు రోజాక్కల్‌’. 1978లో విడుదలైన ఈ సినిమా (తెలుగులో ఎర్రగులాబీలు) కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ సైకో పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఆ చిత్రం సెకండ్‌ పార్ట్‌ తీయడా నికి భారతిరాజా తనయుడు, యువనటుడు మనోజ్‌ సన్నా హాలు చేపట్టారు. ఆ తర్వాత సిగప్పు రోజాక్కల్‌ సీక్వెల్‌ తీయడానికి భారతీరాజ్‌ ముందుకొచ్చారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.అందమైన అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసగించి వారి శవాలను ఇంటి వెనుక గార్డెన్‌లో పూడ్చిపెట్టే సైకో కథతో ‘ఎర్ర‌గులాబీలు’ చిత్రాన్ని రూపొందించారు. కాగా రెండోపార్ట్‌ కోసం అమ్మాయిలను ప్రేమపేరుతో వంచించే యువకులపై హీరోయిన్‌ కక్ష తీర్చుకునే విధంగా వెరైటీ కథను తయారు చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమె కాల్షీట్లు దొరకకపోతే సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేస్తామని మనోజ్‌ తెలిపారు.ఈ చిత్రం వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-08-07T16:05:33+05:30 IST