రకుల్ను కలిసిన క్రిష్.. పవన్ సినిమా కోసం కాదా?
ABN , First Publish Date - 2020-07-31T00:42:28+05:30 IST
దర్శకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న క్రిష్ మరోవైపు డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా దృష్టి సారించారు.
దర్శకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న క్రిష్ మరోవైపు డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా దృష్టి సారించారు. ఇటీవలె `ఆహా` ఓటీటీ కోసం రచయితగా మారి కథ అందించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ల కోసం మరిన్ని కథలు తయారు చేస్తున్నారట. వాటిలో ఒక దాన్ని స్వయంగా తెరకెక్కించబోతున్నారట.
ఆ వెబ్ సిరీస్ కోసమే ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను క్రిష్ సంప్రదించినట్టు తాజా సమాచారం. పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ ఓ సినిమా రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసమే రకుల్ను క్రిష్ సంప్రదించి ఉంటారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే పవన్-క్రిష్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు లేవని, ఆ లోపు ఓ వెబ్ సిరీస్ రూపొందించాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారని, దాని కోసమే రకుల్ను సంప్రదించారని తెలుస్తోంది. మరి, ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.