సినీ దర్శకుడు ఈరోడ్ సౌందర్ మృతి
ABN , First Publish Date - 2020-12-06T18:55:45+05:30 IST
ప్రముఖ సినీ కథారచయిత, దర్శకుడు ఈరోడ్ సౌందర్ శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు.

ప్రముఖ సినీ కథారచయిత, దర్శకుడు ఈరోడ్ సౌందర్ శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోడ్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతూ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు కన్నుమూశారు. సుప్రీం హీరో శరత్కుమార్ నటించిన ‘నాట్టామై’, ‘చేరన్ పాండ్యన్’, ‘సముద్రం’ తదితర చిత్రాలకు ఆయన కథలు సమకూర్చారు. శరత్కుమార్ హీరోగా నటించిన సింహరాశి’ చిత్రానికి ఈరోడ్ సౌందర్ దర్శకత్వం వహించారు. చివరగా ‘అయ్యావుల్లేన్ అయ్యా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయనకు వలర్మతి అనే భార్య, కళైయరసి, గాయత్రి అనే ఇద్దరు కుమార్తెలున్నారు.