విక్రమ్ప్రభుకు జోడీగా లక్ష్మీమీనన్
ABN , First Publish Date - 2020-09-29T20:39:49+05:30 IST
హీరో విక్రమ్ ప్రభు, అందాల భామ లక్ష్మీమీనన్ మరోమారు జంటగా నటించనున్నారు.
హీరో విక్రమ్ ప్రభు, అందాల భామ లక్ష్మీమీనన్ మరోమారు జంటగా నటించనున్నారు. ‘సుందర పాండ్యన్’ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమైన నటి లక్ష్మీమీనన్. ఆ తర్వాత ‘కుంకీ’, ‘కుట్టిపులి, చిత్రాలతో పాటు 2016లో విడుదలైన ‘రెక్క’ చిత్రంలో విజయ్సేతుపతికి జంటగా నటించింది. ఆ తర్వాత చదువుపై దృష్టిసారించి కొన్నేళ్ళు నటించడం మానేసింది. ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. తాజాగా విక్రమ్ ప్రభు హీరోగా నటించనున్న ‘పేచ్చి’ అనే తమిళ చిత్రంలో ఆమె హీరోయిన్గా ఎంపికైంది. ఈ చిత్రానికి ‘కొంబన్’ చిత్రదర్శకుడు ముత్తయ్య దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని, నిర్మాణం పూర్తయ్యాక ఓటీటీలో విడుదల చేస్తామని దర్శకుడు ముత్తయ్య తెలిపారు.