తండ్రీ కొడుకుల కాంబినేషన్..!
ABN , First Publish Date - 2020-06-05T17:05:34+05:30 IST
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో విక్రమ్ తనయుడు ధ్రువ్ కూడా నటిస్తున్నాడని.
![తండ్రీ కొడుకుల కాంబినేషన్..!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020060511324172/06052020113446n48.jpg)
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. పాత్రలో ఒదిగిపోవడానికి ఎంతటి రిస్కైనా చేయడానికి సిద్ధపడే హీరోల్లో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఈయన ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమా చేయబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో విక్రమ్ తనయుడు ధ్రువ్ కూడా నటిస్తున్నాడని. తండ్రీ కొడుకుల కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ సినిమా ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయని వార్తలు వినపడుతున్నాయి. అనిరుధ్ సంగీతం అందించనున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందంటున్నారు.