బాలీవుడ్కు విజయ్ సేతుపతి చిత్రం
ABN , First Publish Date - 2020-05-12T18:41:44+05:30 IST
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో యువతారలు అశోక్సెల్వన్, రిత్వికసింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై కడవులే’. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో అతిథి పాత్రలో నటించారు.
![బాలీవుడ్కు విజయ్ సేతుపతి చిత్రం](https://media.chitrajyothy.com/appimg/galleries/2020051201104146/05122020131135n58.jpg)
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో యువతారలు అశోక్సెల్వన్, రిత్వికసింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మై కడవులే’. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో అతిథి పాత్రలో నటించారు. లాక్డౌన్కు కొన్ని రోజుల ముందు విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే లాక్డౌన్ ప్రకటించాక థియేటర్లు మూతపడడంతో ఈ చిత్రానికి నిరాశే మిగిలింది. ఇటీవల ఓటీటీ ఫ్లాట్ఫామ్లో విడుదల చేయగా, బుల్లితెర ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రీమేక్ విషయమై చర్చలు జరుగు తున్నాయని దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపారు.