‘గీత గోవిందం’ విడుదలై రెండేళ్లు

ABN , First Publish Date - 2020-08-14T21:42:36+05:30 IST

మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా ‘గీత గోవిందం’. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్

‘గీత గోవిందం’ విడుదలై రెండేళ్లు

మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా ‘గీత గోవిందం’. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మికా మందన్న‌లు గోవింద్, గీత పాత్రల్లో ఒదిగిపోయారు. అలానే గోపి సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక అసెట్, వెరసి రెండేళ్ల క్రితం ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 2020, ఆగస్ట్ 15 నాటికి ఈ సర్‌ప్రైజ్ బ్లాక్‌బస్టర్ విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకుంది.


పరశురామ్ డైరెక్షన్ స్కిల్స్

మొదటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిన కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ రూపొందిస్తున్న పరశురామ్.. ‘గీత గోవిందం’ సినిమాతో టాప్ లీగ్‌లోకి వెళ్లిపోయారు. ఈ చిత్రాన్ని థియేటర్‌కి వెళ్లి హాయిగా చూసి నవ్వుకొని, ఎంజాయ్ చేసి వచ్చే రీతిన మలచడంలో పరశురామ్ కీలకం అని చెప్పాలి. కథ ఎక్కడా గాడి తప్పకుండా అందులోనే కమర్షియల్ అంశాలు జోడించి, గీత గోవిందంను బ్లాక్‌బస్టర్ సినిమాగా మార్చి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అలానే సినిమాటోగ్రాఫర్ ఎస్ మణికందన్ కెమెరా పనితనం ఈ చిత్రాన్ని ఓ విజువల్ ఫీస్ట్‌గా మార్చేసింది.


గీతా ఆర్ట్స్ ప్రోడక్ట్

గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి యే సినిమా వచ్చినా.. అది ఓ రేంజ్ సక్సెస్ ఇస్తుందనే నమ్మకాన్ని ‘గీత గోవిందం’ మరోసారి రుజువు చేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో, బన్నీ వాసు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంలో గీతా ఆర్ట్స్ సినిమా అనే బ్రాండ్ గీత గోవిందంపై ఉండటమే ముఖ్య కారణం. 


విజయ్ దేవరకొండను ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గర చేసిన సినిమా

‘అర్జున్ రెడ్డి’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో గీత గోవిందంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఐతే అర్జున్ రెడ్డిని ఎక్కువగా యూత్ ఫాలో అయ్యారు. కానీ గీత గోవిందంతో అటు యూత్‌ని ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఒకేసారి సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. అలానే కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కూడా గీత గోవిందం రూపంలో విజయ్ ఖాతాలోకి వచ్చి చేరింది. అలానే ఈ సినిమాలో గీతగా నటించిన రష్మిక కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.


మరుపురాని గీతం ఇంకేం ఇంకేం కావాలె

ఈ దశాబ్ధపు మరుపురాని గీతాల్లో గీత గోవిందం మ్యూజిక్ ఆల్బమ్‌లో ఉన్న ఇంకేం ఇంకేం కావాలె పాట టాప్ 3 పొజిషన్‌లో ఉండటం ఖాయం. ఈ పాట రిలీజ్ అయిన దగ్గర నుంచే గీత గోవిందం సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పాటకు దాదాపు మూడు వందల ఏభై ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే ఈ పాటని ప్రేక్షకులు ఏ రేంజ్‌లో విన్నారో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా గీత గోవిందం మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌‌గా రికార్డ్స్ బ్రేక్ చేసి రెండేళ్లు పూర్తి చేసుకుంది.

Updated Date - 2020-08-14T21:42:36+05:30 IST