‘దేవరసాంటా 2020’.. విజయ్‌ ఇలా ప్లాన్‌ చేశాడు

ABN , First Publish Date - 2020-12-25T23:59:24+05:30 IST

సెన్సేషనల్ సౌత్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రతి సంవత్సరం ‘‘దేవరసాంటా’’ పేరుతో అందరికీ క్రిస్టమస్ గిఫ్ట్‌లు పంపిస్తాడనే విషయం తెలిసిందే. 2017 నుంచి

‘దేవరసాంటా 2020’.. విజయ్‌ ఇలా ప్లాన్‌ చేశాడు

సెన్సేషనల్ సౌత్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రతి సంవత్సరం ‘‘దేవరసాంటా’’ పేరుతో అందరికీ క్రిస్టమస్ గిఫ్ట్‌లు పంపిస్తాడనే విషయం తెలిసిందే. 2017 నుంచి వరుసగా విజయ్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో.. ఆయన ఎలా ఈ సంవత్సరం ఈ  కార్యక్రమాన్ని నిర్వహిస్తాడా అని అంతా అనుకున్నారు. అయితే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. ఆయన వీడియోకే పరిమితమై.. తన టీమ్‌తో పిల్లలకు గిఫ్ట్‌లు పంపారు. ఈ సంవత్సరం హైదరాబాద్‌లోని 600 మంది చిన్న పిల్లలకు చాక్లెట్స్, తన రౌడీ వేర్ ద్వారా బట్టలు పంపిణీ చేశారు. 


ప్రతి ఏటా నేరుగా అభిమానుల దగ్గరికి వెళ్లి కలిసే విజయ్ ఇప్పుడు కరోనా కారణంగా తన టీమ్ చేత గిఫ్టులు పంపి వీడియో కాల్ ద్వారా పిల్లలతో మాట్లాడాడు. దానికి సంబంధించిన వీడియోను విజయ్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. చిన్న పిల్లలతో విజయ్ మాట్లాడిన విజువల్స్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. 600 మందితోనే ఆగకుండా ఇంకో 1000 మంది చిన్న పిల్లలకు తన ప్రేమను పంచాలనుకుంటున్నట్లుగా విజయ్‌ ఈ వీడియోలో తెలిపాడు. దీనికోసం హ్యాష్ ట్యాగ్ దేవరసాంటా(#Deverasanta)అని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రమ్ లలో పోస్ట్ చేసి అడ్రస్ పెడితే వాళ్ల ఇంటికి గిఫ్ట్ లు పంపిస్తానని వీడియో ద్వారా విజయ్ తెలిపాడు.



Updated Date - 2020-12-25T23:59:24+05:30 IST