కరోనాతో టాలీవుడ్‌ హీరో తాత మృతి

ABN , First Publish Date - 2020-11-11T00:41:59+05:30 IST

హీరో వరుణ్‌ సందేశ్‌ తాత, రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన

కరోనాతో టాలీవుడ్‌ హీరో తాత మృతి

హీరో వరుణ్‌ సందేశ్‌ తాత, రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. రామచంద్రమూర్తి 250కి పైగా కథలు రాశారు. ఉత్తమ టీవీ రచయితగా రెండు సార్లు నంది పురస్కారం అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి సాహిత్యరంగంలో కళారత్న పురస్కారం ఆయనని వరించింది. 'అమెరికా అబ్బాయి' అనే సినిమాకు కథా రచయితగా, 'ఈ ప్రశ్నకు బదులేది' సినిమాకు మాటల రచయితగా ఆయన పనిచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జీడిగుంట రామచంద్రమూర్తి మృతిపట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Updated Date - 2020-11-11T00:41:59+05:30 IST