రెండు భవనాలు.. 200 కోట్లు!
ABN , First Publish Date - 2020-09-28T05:55:45+05:30 IST
ఒకప్పటి బాలీవుడ్ అగ్రనటులు దిలీప్ కుమార్, దివంగత రాజ్కపూర్ల పూర్వీకులకు చెందిన పురాతన భవనాలను పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తూన్క్వా ప్రభుత్వం కొనుగోలు చేయాలని...
![రెండు భవనాలు.. 200 కోట్లు!](https://media.chitrajyothy.com/appimg/galleries/2020092812212155/09282020002525n64.jpg)
ఒకప్పటి బాలీవుడ్ అగ్రనటులు దిలీప్ కుమార్, దివంగత రాజ్కపూర్ల పూర్వీకులకు చెందిన పురాతన భవనాలను పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తూన్క్వా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. పాక్తిస్థాన్లోని పెషావర్లో శిథిలావస్థలో ఉన్న ఆ రెండు భవంతులను కూల్చివేయాలని గతంలో ప్రయత్నాలు జరిగినా పురావస్తు శాఖ అడ్డుపడింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉండి, జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించబడ్డ ఆ భవనాలను యాజమానుల నుంచి కొనుగోలు చేసి పరిరక్షించేందుకు నిధులను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యజమానులు రెండు భవంతులకు రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.